NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ‌న్ మెన్ ను వెన‌క్కి పంపిన ప‌య్యావుల కేశ‌వ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పీఏసీ చైర్మన్‌, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ భద్రత విషయంలో హైడ్రామా చోటుచేసుకుంది. కేశవ్‌కు భద్రతను ఉపసంహరించినట్లు సోమవరం సోషల్‌ మీడియాలో సమాచారం వైరల్‌ అయింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. పయ్యావులకు భద్రతను తొలగించలేదని, గన్‌మ్యాన్‌ను మార్చామని అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ప్రకటించారు. పీఏసీ ఛైర్మన్‌గా ఉన్న కేశవ్‌కు వన్‌ ప్లస్‌ వన్‌ గన్‌మెన్‌ను ప్రభుత్వం కేటాయించింది. అయితే భద్రతా విధుల్లో ఉన్న ఓ గన్‌మ్యాన్‌కు ఉన్నఫలంగా పయ్యావుల భద్రతా విధుల నుంచి వైదొలిగి, హెడ్‌క్వార్టర్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు వెళ్లాయి. అయితే ఈ విషయం పయ్యావులకు తెలియదు. ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉండగా, సోమవారం మధ్యాహ్నం కొత్త గన్‌మ్యాన్‌ అక్కడికి వెళ్లి పయ్యావులకు పరిచయం చేసుకున్నారు. అయితే ఆయన సున్నితనంగా తిరస్కరించి ఆ గన్‌మ్యాన్‌ను వెనక్కు పంపారు.

                                       

About Author