PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రేషన్​ బియ్యం పట్టివేత… ఇద్దరి అరెస్టు

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఉలిందకొండ: తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా మదనపురం గ్రామానికి చెందిన భార్యభర్తలు  కుర్మన్న, పద్మ  కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకపల్లి, వామసముద్రం, ఓబులాపురం తదితర గ్రామాలలో ప్రజల నుండి పీడీఎస్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో  ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో తడకనపల్లె క్రాస్​ దగ్గర పట్టుకున్నట్లు ఉలిందకొండ ఎస్​ఐ శరత్​ కుమార్​ రెడ్డి తెలిపారు.  ఇక్కడి నుంచి తరలించిన బియ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలోని హోటళ్లకు, పందుల దానాకు విక్రయిస్తున్నట్లు కుర్మన్న, పద్మ అంగీకరించారు. వారి వద్ద నుంచి bolero pickup వాహనమును , సుమారు ఒక టన్ను ( 35 పాకెట్స్ , ఒక్కొకటి 30 కేజీలు) రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ శరత్​ కుమార్​ రెడ్డి పేర్కొన్నారు.

About Author