NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భక్తిశ్రద్ధలతో శిఖర ప్రతిష్ట…

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలి మండల పరిధిలోని ఎన్ రంగాపురం గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయంలో  సోమవారం భక్తిశ్రద్ధలతో శిఖర ప్రతిష్టను చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో 17, 18,19తేదిలో మూడు రోజులు గ్రామంలో పండగ వాతావరణంతో నిర్వహించి, దేవాలయంలో ఆంజనేయస్వామి, సీతారాముల,లక్ష్మణ, శివుడు, నవగ్రహాలకు ,ధ్వజ స్తంభానకు ప్రత్యేక పూజలు ఆచరించి, అనంతరం ధూప దీప నైవేద్యాలతో హోమాలు నిర్వహించారు. ప్రతి ఇంటిలో ఆడపడుచులకు ఓడి బియ్యం పెట్టి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో ఆయుఆరోగ్యాలతో పాడిపంటలు కొలువు తీరాలని, సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామస్తులు కోరినట్లు తెలిపారు.ఆలయం ప్రాంగణంలో సర్పంచ్ సుబ్బారెడ్డి అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author