PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెండింగ్ లో ఉన్న హౌసింగ్ నిర్మాణాలు పూర్తి చేయాలి

1 min read

– తాసిల్దార్ పటాన్ అలీ ఖాన్, ఎంపీపీ చీర్ల

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు :  సొంత స్థలాలలో నిర్మిస్తున్న  వివిధ దశలలో పెండింగ్ లలో ఉన్న గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని తాసిల్దార్ పటాన్ అలీ ఖాన్, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ లు తెలిపారు, ఈ మేరకు వారు చెన్నూరు లోని, అరుంధతి నగర్, గాంధీనగర్ లలో పర్యటించి అక్కడి గృహ నిర్మాణ లబ్ధిదారులతో సమావేశమై వారు గృహ నిర్మాణాలు పూర్తి చేసే విధంగా వారికి అవగాహన కల్పించడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సొంత స్థలాలలో గృహ నిర్మాణం చేపట్టిన గృహ లబ్ధిదారులు 370 మంది ఉన్నారని అయితే అందులో 300 గృహాలు పూర్తి కావడం జరిగిందని, ఇంకా 70 గృహాలు వివిధ దశలలో ఉన్నాయని వాటిని కూడా లబ్ధిదారులు సకాలంలో పూర్తి చేయాలని వారు ఈ సందర్భంగా లబ్ధిదారులను కోరడం జరిగిందని తెలిపారు , వీటికి సంబంధించి బిల్లులు సకాలంలో ఇవ్వడం జరుగుతుందని వారు తెలియజేశారు అంతేకాకుండా కనపర్తి లేఅవుట్లలో నిర్మించే జగనన్న కాలనీలలో కూడా ప్రభుత్వ పక్కా గృహాలు వేగవంతంగా పనులు జరుగుతున్నాయని వీటిని కూడా వీలైనంత త్వరలో పూర్తి చేసి ప్రజలకు ఇవ్వడం జరుగుతుందని వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ మేనిల్, పి ఆర్ ఏఈ మురళి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సుజిత తదితరులు పాల్గొన్నారు.

About Author