PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి ..సిపిఎం 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, ఎంతోకాలంగా అపరిస్కృతంగా ఉన్న  సమస్యల పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా నాయకులు హనుమంతు కోరారు. కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధికై  జూలై 26 నుండి 31 వరకు ఆదోని నుండి కర్నూలు వరకు వందలాది మందితో సిపిఎం మహా పాదయాత్ర జయప్రదం చేయాలని కోరుతూ, బుధవారం తుగ్గలి మండలంలోని ముకెళ్ళ గ్రామంలో జిపు జాత చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హంద్రీనీవా ద్వారా 46వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన పనులు ఇప్పటికీ పూర్తికాక ఈ ప్రాంత రైతాంగం ఇబ్బందులు పడుతుందని తెలిపారు. అలాగే వెనకబడిన పశ్చిమ ప్రాంతం పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని 1o6 చెరువులకు నీటిని నింపాలని కోరారు. జిల్లాలో అపరిస్కృతంగా ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో  సీపీఎం మండల కార్యదర్శి శ్రీరాములు, సీనియర్ నాయకులు కొండా రెడ్డి, పత్తికొండ మండల కమిటీ సభ్యులు పెద్దహుల్తీ సురేంద్ర, కమిటీ సభ్యులు రంగరాజు, శ్రీనివాసులు, రంగస్వామి తదితర పాల్గొన్నారు.

About Author