PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతుల‌కు పింఛ‌న్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రైతుల‌కు పింఛ‌న్ ఇవ్వాల‌న్న ఆలోచ‌న‌లో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేర‌కు ఆర్థిక శాఖ అధికారులు క‌స‌రత్తు ప్రారంభించార‌ని స‌మాచారం. రైతుల‌కు పింఛ‌న్ ఇవ్వ‌డం ద్వార చారిత్రాత్మక కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే బ‌డ్జెట్ లో ఈ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించే ఏర్పాట్ల‌లో సీఎం కేసీఆర్ ఉన్నారు. రైతుల పింఛన్‌పై సాధ్యాసాధ్యాలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. రైతులకు రూ.2వేలు ఇచ్చే పనిలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. 47 ఏళ్లు నిండిన చిన్న, సన్నకారు రైతులకు పింఛన్‌ ఇచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు.

                                      

About Author