PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగన్ ను ఓడించడానికి ప్రజలు “సిద్ధం” గా ఉన్నారు

1 min read

చంద్రబాబు తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం! డాక్టర్ మాచాని సోమనాథ్

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు :  ఎమ్మిగనూరు పట్టణంలోఒక్క ఛాన్స్ పేరుతో.. అధికారంలోకి వచ్చి ప్రజలను పాలించడంలో ఘోరంగా విఫలం చెందిన ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రజలు “సిద్ధం”గా ఉన్నారని డాక్టర్ మాచాని సోమనాథ్ పేర్కొన్నారు. ఆయన సోమవారం ఉదయం పట్టణంలోని ఎస్సీ కాలనీ, టీచర్స్ కాలనీ, శాంతినగర్ 7,8 మున్సిపల్ వార్డులలో “బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ” పై ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించారు. శోభనూరు రోడ్డు తిక్క స్వామి గుడి దగ్గర పిడిఎస్ రైస్ సప్లై వాహనం దగ్గర మహిళలను పలకరించి బియ్యం తూనికలను పరిశీలించారు. సకాలంలో రేషన్ లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయాలని డీలర్ ను కోరారు.మహాశక్తి పేరుతో మహిళలకు “తల్లికి వందనం” పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15వేల  చొప్పున, “ఆడబిడ్డ నిధి” నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి నెలకు రూ.1500/- లు,”దీపం” పేరుతో.. ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు సూపర్ సిక్స్ లో చేర్చి చంద్రబాబు మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారని, సీఎం జగన్ మాత్రం మహిళలకు “ఆసరా” పేరుతో.. “టోకరా” చేస్తున్నారని దుయ్యపడ్డారు. మెగా డీఎస్సీ పేరుతో కేవలం 6100 ఉద్యోగాలు విడుదల చేసి నిరుద్యోగ యువతను దగా చేశారని మండిపడ్డారు. అధికార పార్టీ టిడిపి పై ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా ఎన్నికల ధర్మ యుద్ధంలో గెలిచేది నిలిచేది చంద్రబాబే నన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రజలు “సిద్ధం”గా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో.. కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి.అల్తాఫ్, ఎస్సీ కాలనీ టిడిపి నాయకులు రోజా ఆర్ట్స్ ఉసేని, సప్లయర్స్ బంగారప్ప, కంపాడు చిన్న రంగన్న, యస్. సాల్మన్, జాలవాడి ఏసన్న, పందికోన సురేష్, జే.జయపాల్ తదితరులు ఉన్నారు.

About Author