PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలు ఆరోగ్యం కాపాడుకోవాలి: టీజీ భరత్​

1 min read

పల్లెవెలుగువెబ్​, కర్నూలు : ఉచిత వైద్య శిబిరాల‌ను ప్రజ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని టిడిపి క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని పెద్దమార్కెట్ వ‌ద్ద టిడిపి మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ అబ్దుల్ హ‌మీద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని టి.జి భ‌ర‌త్ ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ప్రజ‌లు వ్యక్తిగ‌తంగా హాస్పిట‌ల్‌కు వెళ్లి వైద్య ప‌రీక్షలు చేయించుకోవాలంటే చాలా ఖ‌ర్చువుతుంద‌న్నారు. అందుకే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన‌ప్పుడు ముందుకొచ్చి ప‌రీక్షలు చేయించుకోవాలని కోరారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆరోగ్యాల ప‌ట్ల జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచించారు. స్థానిక ప్రజల ఆరోగ్యాల‌ను దృష్టిలో పెట్టుకొని ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేసిన‌ హ‌మీద్‌ను టి.జి భ‌ర‌త్ అభినందించారు. ఈ కార్యక్రమంలో 2వ వార్డు కార్పోరేట‌ర్ అబ్దుల్ లతీఫ్‌, టిడిపి టౌన్ ప్రెసిడెంట్ గున్నా మార్క్‌, జ‌హంగీర్‌, మ‌హ్మద్ అస్లాం, మ‌హ‌బూబ్‌, గ‌ఫార్‌, ర‌మేష్‌, మ‌దార్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.


About Author