NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపి ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కర్నూలు నియోజకవర్గ టిడిపి నేతలు అన్నారు. నగరంలోని 49 వ వార్డులోని ఎన్.ఆర్ పేటలో తెలుగుదేశం పిలుస్తోంది నగరమా మేలుకో కార్యక్రమం నిర్వహించారు. వార్డులోని ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి తెలుగుదేశం, జనసేన పార్టీల మేనిఫెస్టో గురించి వివరించారు. వచ్చే ఎన్నికల్లో కర్నూల్లో టి.జి భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. టి.జి భరత్ గెలిస్తే ప్రజలకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారని వివరించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ పెరిగిపోయిన ధరలతో ప్రజలు విసిగిపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా టిడిపికే ఓటు వేస్తామని ప్రజల నుండి స్పందన వస్తోందన్నారు. టిడిపి వస్తే అభివ్రుద్ది ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, నేతలు విక్రమ్ సింగ్, శంకర్ సింగ్, పరమేష్, రామ్మూర్తి, మన్సూర్, చంద్రశేఖర్, మణి ప్రకాష్, అసద్, హనుమంత్ నాయక్, లక్ష్మన్న, నాగేంద్ర సింగ్, దాసు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

About Author