PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసిపికి  ప్రజలు ఓటు తో సమాధానం చెబుతారు..

1 min read

– వచ్చే ఎన్నికల్లో అక్రమాలకు తెరలేపి అధికారంలో రావడమే వైసిపి లక్ష్యం.

– అందుకే బాబు అక్రమ అరెస్ట్…రాష్ట్ర టిడిపి మైనారిటీ అధ్యక్షుడు ..మౌలానా ముస్తాక్ అహ్మద్..

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  నియంతృత్వ పాలనకు నిదర్శనంగా వైసీపీ ప్రభుత్వ పాలన రాష్ట్రంలో నడుస్తుందని త్వరలోనే ప్రజలు ఓటు తో సమాధానం చెబుతారని శనివారం నాడు గడివేముల మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో రాష్ట్ర టిడిపి మైనార్టీ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు బాబు అక్రమ అరెస్టు పై తీవ్ర భావోద్వేగాలకు గురవుతున్నారని నిరసనలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం బాగుండాలని కోరుకునే మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అమరావతిలో పాలన చేస్తున్న వైసిపి ప్రభుత్వం సచివాలయం హైకోర్టు ప్రతిదీ చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించినదని రాష్ట్రంలో పరిశ్రమలను చంద్రబాబు తెచ్చారని కియా లాంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థను రాష్ట్రానికి తెచ్చిన ఘనత బాబుది కాదా ఐటి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టిన విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని కర్నూలు జిల్లాలో సోలార్ పార్క్ ఓర్వకల్ ఏర్పోర్ట్ ఉర్దూ యూనివర్సిటీ. జయరాజ్ ఇస్పత్ స్టీల్ పరిశ్రమ చంద్రబాబు నాయుడు తెచ్చినవి కావా అని ప్రశ్నించారు. మూడు రాష్ట్ర రాజధానులు అంటూ నాటకాలు ఆడుతున్నారని వైజాగ్ లో వైజాగ్ లో పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తే రాయలసీమ వాసులకు రాజధానికి వెళ్లాలంటే  రెండు రోజులు పడుతుందని తుగ్లక్ పాలనకు నిదర్శనంగా జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని ఎన్ని నాటకాలు ఆడినా వచ్చే ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మేము కూడా మీ పాలనపై సమీక్ష చేస్తామని మీకు పుట్టగతులు ఉండవని ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు  . జైలులో చంద్రబాబు నాయుడు అనారోగ్యం పాలై చికిత్స కోసం పర్సనల్ వైద్య సిబ్బందిని అనుమతించమంటే అంతా బాగుందని ప్రెస్ నోట్ రిలీజ్ చేసే జైల్లో శాఖ ఐజి అసలు అతనికి ఏమిటి సంబంధమని ప్రెస్ నోట్ ఇవ్వాల్సిన బాధ్యత జైలు సూపర్డెంట్ లేదంటే వైద్యులని వ్యవస్థలను వాడుకొని అక్రమ అరెస్టు చేసి వచ్చే ఎన్నికలలో ప్రతిపక్షం లేకుండా చేసి మళ్లీ అధికారంలో రావాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఓటేస్తే రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు  వలసబాట పట్టాల్సి ఉంటుందని దొంగ ఓట్లను భారీగా చేర్చుకుంటున్నారని అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ టిడిపి ఉనికి లేకుండా చేయాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డికి సజ్జల తోడై తాడేపల్లి కొంప నుండి వచ్చే ఆదేశాల కోసం పిల్లిలా ఎదురు చూస్తుంటారని టిడిపి కార్యకర్తలు నాయకులు ఏకమై ఈసారి భారీ మెజార్టీతో టిడిపి ప్రభుత్వం వచ్చేలా కృషి చేయాలని తెలిపారు.టిడిపి పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త నాయకులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మండల టిడిపి అధ్యక్షుడు సత్యం రెడ్డి.పంట రామచంద్ర రెడ్డి . సీతా రామి రెడ్డి..రాష్ట్ర టిడిపి మైనార్టీ కార్యదర్శి  ఎస్ ఏ ఫరూక్ టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author