NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజల అభివృద్ధే బిజెపి లక్ష్యం

1 min read

కమలాపురం నియోజకవర్గం బీజేపీ ఇంచార్జ్ గుత్తి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి..

పల్లెవెలుగు వెబ్ చింతకొమ్మాదీన్నే : పల్లెకుపోదాం గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా కమలాపురం నియోజకవర్గంలోని చింతకొమ్మదిన్నె మండలం బుసిరెడ్డిపల్లి పంచాయతీ అప్పరాజుపల్లి, గోపాలపురం గ్రామలలో బిజెపి నాయకులు పర్యటించారు, బిజెపి నాయకులతో కలిసి కమలాపురం నియోజకవర్గం బిజెపి ఇన్చార్జి గుత్తిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ ఆయన మాట్లాడుతూ బిజెపితోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా సంతోషంగా ఉంటారని అన్నారు, కేంద్రంలో పాటు రాష్ట్రంలో కూడా బిజెపి అధికారంలోకి వస్తే అభివృద్ధి మన రాష్ట్రంలో కూడా ఎక్కువ చెందుతుందన్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు సేవ చేయడం ఒక బాధ్యతగా వ్యవహరిస్తున్నారని తెలిపారు, ఆయన ప్రజల అభివృద్దె లక్ష్యంగా జీవిస్తున్నారన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి బాలకృష్ణ యాదవ్, జిల్లా విస్తారక్ రవికుమార్, బిజెపి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సోబాబాయ్, జిల్లా కిసాన్ మోర్చ్ కార్యదర్శి సుబ్బారెడ్డి, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు గణేష్, చింతకొమ్మదిన్నె బిజెపి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author