NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజల కల సాకారం కాబోతుంది…

1 min read

పల్లెవెలుగు వెబ్ వెల్దుర్తి : క్రిష్ణగిరి మండలం టి. గోకులపాడు గ్రామస్తుల కల సాకారం కాబోతుందని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. గ్రామ సమీపంలో హంద్రీ నదిపై నూతనంగా మంజూరైన రూ. 7.95 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి స్థలాన్ని పంచాయతీరాజ్ ఎస్సీ సుబ్రహ్మణ్యం, పి ఐ యు డిఈ రమేష్ కుమార్ రెడ్డి , ఎంపీపీ డాక్టర్ కంగాటి వెంకటరామిరెడ్డి తో కలిసి  పరిశీలించారు.ఈ బ్రిడ్జి ఏర్పాటుతో ఎన్నో ఏళ్లుగా ఆశతో ఎదురుచూస్తున్న గ్రామస్తుల కల సహకారం అవుతుందన్నారు.అలాగే మండల కేంద్రానికి రావడానికి సౌకర్యంగా ఉంటుందని  తెలియజేశారు. బ్రిడ్జి పనులను త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గోకులపాడు గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author