PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజల చూపు..హస్తం వైపు..!

1 min read

డీసీసీ మైనార్టీ చైర్మన్ ఆడిటర్ మన్సూర్ అలీ ఖాన్

పల్లెవెలుగ,  అన్నమయ్య జిల్లా బ్యూరో: దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ వరసగా విజయాలు సాధించుకుంటూ దూసుకు పోతువుందని, రాష్ట్ర ప్రజలచూపు కూడా హస్తం వైపు మళ్లీందని అన్నమయ్య జిల్లా డీసీసీ మైనార్టీ అధ్యక్షుడు ఆడిటర్ మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో విజయం సాధించి  అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరల తెలంగాణలో భారీ మెజార్టీతో విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ హస్తం వైపు  చూస్తున్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక మరియు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 2024వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుండి కచ్చితంగా సుమారు 30- 40 మంది  ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా మేలుకొని రాబోయే 2024వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకు పట్టం కట్టాలని ఆయన మైనార్టీతో పాటు అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు.

About Author