PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలుగుదేశం గెలిస్తేనే ప్రజలకు భవిష్యత్తు.. టిడిపి నేతలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని కర్నూలు నగర టిడిపి అధ్యక్షుడు నాగరాజు యాదవ్ అన్నారు. ఆదివారం నగరంలోని 14వ వార్డులో తెలుగుదేశం పిలుస్తోంది నగరమా మేలుకో కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలను కలిసి కలిసి తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాల గురించి వివరించారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసి టి.జి భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. టి.జి భరత్ గెలిస్తే స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటారని చెప్పారు. టిడిపి గెలిస్తేనే సంక్షేమం, అభివృద్ధి ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో నేతలు అబ్బాస్, తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

About Author