PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజల ఆస్తులు దోచుకునింది చాలు…

1 min read

ఇక మూట ముల్లే సర్దుకో…

  • ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కూటమి అభ్యర్థి డా. పార్థసారధి

 ఆదోని, పల్లెవెలుగు:నియోజకవర్గంలో ఎక్కడ చూసినా… భూ కబ్జాలు…దందాల బాధితులు అధికంగా ఉన్నారని, ప్రజల ఆస్తులు దోచుకనింది చాలు… ఇక మూటముల్లే సర్దుకో అంటూ ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి కూటమి అభ్యర్థి డా. పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పట్టణంలో కూటమి నేతలు విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా డా. పార్థసారధి మాట్లాడుతూ ఆదోని పట్టణంతోపాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో భూ కబ్జాలు చేశాడని, ఇసుక, మద్యం, క్వారీ మాఫియాను పెంచి పోషించి… కోట్ల రూపాయలు గడించాడని విమర్శించారు. ప్రజలకు మంచి పాలన అందిస్తాడన్న నమ్మకంతో పదేళ్లు ఎమ్మెల్యే పదవిని కట్టబెట్టారని, కానీ మంచి పాలన అందించకపోగా… భూ కబ్జాలు, దందాలు చేస్తూ… అనుచరులను పెంచిపోషిస్తున్నాడని ఎమ్మెల్యేపై ఫైర్​ అయ్యారు. భూమి ఖాళీగా ఉంటే చాలు… కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు.  ఆదోని నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి… కమలం గుర్తుకు ఓటు వేసి.. తనను గెలిపిస్తే… ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి డా. పార్థసారధి హామీ ఇచ్చారు. భూ కబ్జాదారుల నుంచి భూమిని తిరిగి ఇప్పిస్తానని పేర్కొన్నారు.

About Author