PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టి.జి భ‌ర‌త్‌కే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు.. టిడిపి నేత‌లు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: క‌ర్నూల్లో ఏ వీధికి వెళ్లినా క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ నాయ‌క‌త్వానికి ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్నార‌ని టిడిపి న‌గ‌ర అధ్య‌క్షుడు నాగ‌రాజు యాద‌వ్‌, ఇత‌ర నేత‌లు అన్నారు. న‌గ‌రంలోని 5వ వార్డు చిత్తారివీధిలో న‌గ‌ర‌మా మేలుకో 2వ విడ‌త కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులంతా ఇంటింటికీ వెళ్లి పెద్ద‌లు, మ‌హిళ‌లు, యువ‌కుల‌ను క‌లిసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు. టి.జి భ‌ర‌త్ గెలిస్తే క‌ర్నూల్లో ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా ప‌రిపాల‌న సాగిస్తార‌ని హామీ ఇచ్చారు. యువ‌కులు ఉద్యోగాల కోసం ఇబ్బందులు ప‌డ‌కుండా ఈ ప్రాంతానికి పరిశ్ర‌మ‌లు తీసుకొస్తార‌ని వివ‌రించారు. టి.జి భ‌ర‌త్‌ను గెలిపిస్తే అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందేలా చ‌ర్య‌లు తీసుకుంటార‌ని ప్ర‌జ‌ల‌తో చెప్పారు. అనంత‌రం టిడిపి నేత‌లు మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్న‌ప్పుడు ఖ‌చ్చితంగా టి.జి భ‌ర‌త్‌కే ఓటు వేస్తామ‌ని చెబుతున్నార‌న్నారు. ఇప్పుడు ప‌డుతున్న ఇబ్బందులు తీరాలంటే టి.జి భ‌ర‌త్ గెల‌వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ నేత‌లు అబ్బాస్‌, ముంతాజ్‌, వార్డు నేత‌లు బాలు, విజ‌య‌ల‌క్ష్మి, ఇంద్ర‌జ‌, సురేష్‌, నాగ‌రాజు, న‌రేష్‌, న‌రేష్‌, హిదాయ‌త్‌, త‌దిత‌ర నేత‌లు పాల్గొన్నారు.

About Author