PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలతో మమేకమై.. ఫ్రెండ్లీ పోలీసుగా విధుల నిర్వహణ

1 min read

– ఫ్రెండ్లీ పోలీసుగా ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి అవుకు ఎస్సై జగదీశ్వర్ రెడ్డి
పల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె : నియోజకవర్గంలోని కోయిలకుంట్ల మండలంలో పనిచేస్తున్న ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారని మండల ప్రజలు చెప్తున్నారు. మండలంలోని ప్రజలు ఏదైనా సమస్య పై పోలీస్ కార్యాలయానికి వస్తే చిరునవ్వుతో మర్యాదపూర్వకంగా పలకరించి సమస్యను విని సత్వరమే పరిష్కారం చేసి ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందేలా విధులు నిర్వహిస్తున్నారని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో మద్యం నాటు సారా సేవించి అల్లర్లకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ.. సత్ప్రవర్తనతో మెలగాలని అవగాహన సదస్సులు నిర్వహించడం, విద్యతోనే ఈ సమాజం మార్పు చెందుతుందని కుటుంబంలో ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలని గ్రామీణ ప్రాంతాల్లో పలు సభలలో అవుకు ఎస్సై జగదీశ్వర్ రెడ్డి కోవెలకుంట్ల ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.

About Author