PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెంపుడు కుక్క మ‌ర‌ణం.. య‌జ‌మాని ఆత్మ‌హ‌త్య !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పెంపుడు కుక్క చనిపోవడంతో యజమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. కొవ్వూరు మండలం దొమ్మేరులో ఈ నెల 7 వరిగేటి శ్రీను అనే వ్యకి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని విశాఖ కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెంపుడు కుక్క చనిపోవడంతో శ్రీను ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని భార్య రాజమణి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

                                      

About Author