PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పెట్రోల్ ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మ‌ధ్యప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తి పెట్రోల్ ఫ్రీ అంటూ ప్రక‌టించాడు. బేతుల్‌ జిల్లాకి చెందిన దీపక్‌ సైనాని అనే వ్యక్తి, తన చెల్లెలికి అక్టోబర్‌ 9న ఆడపిల్ల పుట్టింది. మేనకోడలు పుట్టిన సంబరంలో దీపక్‌ సైనాని పెట్రోల్‌ బంకుకు వచ్చిన కష్టమర్లందరికీ పెట్రోల్‌, డీజిల్‌ ఫ్రీ అని ప్రకటించాడు. దసరా నవరాత్రుల వేళ అక్టోబర్‌ 13, 14, 15 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు 10 శాతం అదనంగా పెట్రోల్‌ ఉచితం అని ప్రకటించాడు. రూ.100లకు పెట్రోల్‌ కొన్న కస్టమర్లకు 5 శాతం, 200 – 500 రూపాయలకు పెట్రోల్‌ కొన్నవారికి 10 శాతం పెట్రోల్‌ ఫ్రీగా అందించానని స్థానిక మీడియాకు వెల్లడించాడు. కాగా గత కొంతకాలంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశానుంటుతున్నాయి.

About Author