PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వారి పై దాడే పీఎఫ్ఐ ఎజెండా : ఎన్ఐఏ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) అజెండా ఇదేనంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక వివరాలు వెల్లడించింది. దేశంలో ఒక వర్గానికి చెందిన ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పథక రచన చేసిందని వివరించింది. ఎన్ఐఏ ఇటీవల దేశవ్యాప్తంగా దాడులు జరిపి 106 మంది పీఎఫ్ఐ సభ్యులను అరెస్ట్ చేసింది. వీరిలో అత్యధికంగా కేరళకు చెందిన 22 మంది, కర్ణాటకకు చెందిన 20 మంది ఉన్నారు. సోదాల్లో అనేక కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. వీరిలో 10 మందిని కస్టడీకి అప్పగించాలని ఎన్ఐఏ న్యాయస్థానాన్ని కోరింది. దీనికి సంబంధించిన రిమాండ్ రిపోర్టును ఎన్ఏఐ కోర్టు ముందుంచింది.

                                                   

About Author