PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హింస‌కు దిగిన పీఎఫ్ఐ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎన్‌ఐఏ, ఈడీ అధికారుల వరుస దాడులు, అరెస్టులను నిరసిస్తూ పాపులర్‌ ఫ్రంట్‌ ఇండియా హింసోన్మాదానికి దిగింది. పోలీసులు, ప్రయాణికుల వాహనాలే లక్ష్యాలుగా పెద్దఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. శుక్రవారం తెల్లవారుతుండగానే ఆగ్రహావేశాలతో ఊగిపోతూ పీఎఫ్ఐ కార్యకర్తలు గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చారు. సాయంత్రం వరకు భారీ నిరసన ప్రదర్శనలతో రాష్టాన్ని అట్టుడికించారు. దేశవ్యాప్తంగా ఉన్న పీఎఫ్ఐ కార్యాలయాలు, శిక్షణ సంస్థలపై గురువారం ఎన్‌ఐఏ, ఈడీ దాడులు జరిపి 100మందికిపై ఆ సంస్థ కార్యకర్తలు, నాయకులను అరెస్టుచేసిన విషయం తెలిసిందే. ఇందులో సింహభాగం దాడులూ, అరెస్టులూ కేరళలోనే కొనసాగాయి.

                                                

About Author