PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చెన్నూరు వాసి కి పీహెచ్డీ (డాక్టరేట్ )ప్రధానం..

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  కొత్త గాంధీ నగర్ వాసి టిడిపి జిల్లా అధికార ప్రతినిది అమూరి బాలదాసు ద్వితీయ కుమారుడైన అమూరి భరత్ కు అస్సాం వ్యవసాయ విశ్వ విద్యాలయం నుంచి పిహెచ్ డి లభించింది.అమూరి భరత్ నేమటాలజీ విభాగంలో క్రూసిఫరస్ పంటల యొక్క ప్రధాన కీటకాల. తెగుళ్లకు వ్యతిరేకంగా స్థానిక ఎంటోమోపాథోజెనిక్ నెమటోడ్ ల జీవ సమర్థత అనే పరిశోధనకు డాక్టరేట్ లభించింది. యం.యస్.సి అస్లాం వ్యవసాయ విశ్వ విద్యాలయంలో పట్టాను పొందారు, అక్కడే పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పొందారు. ప్రస్తుతం ప్లాంట్ క్వారంటైన్ లో టెక్నికల్ ఆఫీసర్గా ఆర్ పీ కౄ ఎస్ కోల్కతా లో ఉద్యోగం చేస్తున్నారు. అమూరి భరత్ కు కుటుంబ సభ్యులు,బంధు మిత్రువులు మరియు పలువురు విద్యా వేత్తలు అభినందనలు తెలిపారు.

About Author