PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌రెన్సీ నోట్ల పై ఠాగూర్, క‌లాం ఫోటోలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌రెన్సీ నోట్ల పై విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, మిసైల్‌ మ్యాన్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఫొటోలను ముద్రించాలని భారతీయ రిజర్వు బ్యాంక్‌ భావిస్తోంది. ఇప్ప‌టి వ‌రకు మ‌హాత్మా గాంధీ ఫోటోల‌ను మాత్ర‌మే చూస్తున్నాం. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. గాంధీ ఫొటో ఉన్న నోట్లు ఎప్పటిలాగే చలామణిలో ఉంటాయి. కొత్తనోట్లపై మాత్రమే ఠాగూర్‌, కలాం ఫొటోలను ముద్రిస్తారు. ఫొటోల డిజైన్‌ను ఇప్పటికే కేంద్రం ఆమోదించినట్టు తెలిసింది. గాంధీ కొత్త ఫొటోలతో పాటు ఠాగూర్‌, కలాం ఫొటోలను ఐఐటీ ఢిల్లీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దిలీప్‌ షహానీకి పంపినట్టు సమాచారం. ఎలకో్ట్రమాగ్నెటిక్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ రంగంలో నిపుణుడైన ప్రొఫెసర్‌ దిలీప్‌ షహానీ సెక్యూరిటీ తదితర అంశాలను పరిశీలించి ఫొటోలను కేంద్రానికి సిఫార్సు చేస్తారు. 2017లో ఆర్బీఐ నియమించిన ఓ అంతర్గత కమిటీ.. కరెన్సీ నోట్లపై సెక్యూరిటీ ఫీచర్లను పెంచడంలో భాగంగా గాంధీతోపాటు ఠాగూర్‌, కలాం ఫొటోలను కూడా ముద్రించాలని 2020లో సిఫార్సు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

                                     

About Author