PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాయలసీమ జోన్ ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా..

1 min read

– కర్నూల్ రేంజ్ డిఐజి శ్రీ యస్. సెంథిల్ కుమార్ ఐపియస్ గారు.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  రాయలసీమ జోన్ పరిధిలో కర్నూల్ APSP  2  వ బెటాలియన్ లో   సెప్టెంబర్ 5 వ తేది (మంగళవారం) జరగాల్సిన ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను  కర్నూల్ రేంజ్ డిఐజి శ్రీ. సెంథిల్ కుమార్ ఐపియస్ గారు  వాయిదా వేశారు. కర్నూల్ పట్టణంలో  కురుస్తున్న భారీ వర్షం  కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్నూల్ రేంజ్ డిఐజి శ్రీ యస్. సెంథిల్ కుమార్ ఐపియస్  ఈ విషయాన్ని ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. సెప్టెంబర్ 5 వ తేది (మంగళవారం) జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షల్ని 2023  సెప్టెంబరు 22 వ తేదికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారుసెప్టెంబర్ 5 వ తేదీ దేహదారుడ్య పరీక్షలకు హాజరయ్యే ఎస్సై  అభ్యర్థులు 2023 , సెప్టెంబర్ 22 తేదీ న  రావాల్సిందిగా కర్నూల్ రేంజ్ డిఐజి   శ్రీ యస్. సెంథిల్ కుమార్ ఐపియస్   విజ్ఞప్తి చేశారు.

About Author