NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్రికెట‌ర్ ర‌షీద్ కు ప‌వ‌న్ ఆర్థిక సాయం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భారత అండర్‌-19 వరల్డ్‌కప్‌ టీమ్‌ వైస్‌ కెప్టెన్‌, గుంటూరు క్రికెటర్‌ షేక్‌ రషీద్‌కు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించారు. భారత యువ జట్టు కప్‌ నెగ్గడంలో రషీద్‌ ముఖ్యభూమిక పోషించాడు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడంతో రషీద్‌ను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చినట్టు పవన్‌ తెలిపారు. జనసేన ఆంధ్రప్రదేశ్‌ కార్యదర్శి మార్కండేయ ఈ రూ.2 లక్షల చెక్‌ను రషీద్‌ కుటుంబానికి గుంటూరులో అందించారు.

                                                 

About Author