NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యే తోపుదుర్తి పై ప‌రిటాల ఫైర్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అనంత‌పురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ఒక్క అభివృద్ధి పని చేయలేదని ఆయన విమర్శించారు. ప్రకాష్‌రెడ్డి బెదిరించి జాకీ పరిశ్రమను పారిపోయేలా చేశారని ఆయన ఆరోపించారు. పేరూరు డ్యాంను నిలిపివేశారని ఆయన పేర్కొన్నారు. గత మూడేళ్లుగా అనేక అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని శ్రీరామ్ అన్నారు.

                                              

About Author