PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ లో పీకే చేరిక ఖాయం.. కానీ కొన్ని ష‌ర‌తులు !

1 min read

పల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ రాజ‌కీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్ కాంగ్రెస్ లో చేరిక దాదాపు ఖ‌రారు అయింది. అయితే ఇందుకు కాంగ్రెస్ పార్టీ రెండు ప్రధాన షరతులు పెడుతున్నట్లు తెలిసింది. వివిధ పార్టీలతో సంబంధాలు తెంచుకోవాలని.. పూర్తి కాలం కాంగ్రె్‌సకే పనిచేయాలని స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. పీకే కన్సల్టెన్సీ ‘ఐ-ప్యాక్‌’ సంస్థ వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీలతో ఒప్పందం కుదుర్చుకుని ఎన్నికల్లో వ్యూహప్రతివ్యూహాలతో వాటిని గెలుపు బాట పట్టిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ బంధాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టి.. కాంగ్రెస్ కే పూర్తి సమయం వెచ్చించాలని కాంగ్రెస్‌ ఆయన్ను కోరుతున్నట్లు సమాచారం. ఆయన సమర్పించిన బ్లూప్రింట్‌పై అధ్యయనానికి, ఆయన్ను పార్టీలో చేర్చుకునే అంశంపై చర్చించడానికి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఓ త్రిసభ్య కమిటీని నియమించారు.

                                 

About Author