PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

RRRని చంపాలని ప్లాన్…!

1 min read

పల్లెవెలుగు వెబ్​: ముఖ్యమంత్రి వైఎస్​ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సిఐడి చీప్ సునీల్ కుమార్ పై సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ రఘురామకృష్ణంరాజు భార్య రమాదేవి. తన భర్తను ఈరోజు రాత్రి జైలులో చంపడానికి కడప రౌడీలను గుంటూరు జైలులో ఉంచారని ఆమె అన్నారు. తన భర్త ప్రాణానికి ప్రమాదం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థ కూడా రాజ్యాంగ బద్దంగా పనిచేయడం లేదన్నారు. హైకోర్టు ప్రైవేటు హాస్పిటల్ కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినా కోర్టు ఆదేశాలను కూడా పాటించకుండా కేవలం ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించి జైలుకు తరలించారని చెప్పారు. హత్యలు చేసినవారు ,20 ,30 కేసులు వున్నవారు బయట తిరుగుతున్నారు… తన భర్త ఏం చేసాడని ఇలా వేదిస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ సిఐడి చీప్ సునీల్ కుమార్ రాజ్యాంగ వ్యతిరేకంగా విధులు నిర్వహిస్తున్నారని..తన భర్తకు ఏం జరిగినా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సిఐడి చీప్ సునీల్ కుమార్ దే బాధ్యత అని ఆమె తెలిపారు.

About Author