NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్ టి యు వజ్రోత్సవాల సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం  

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  ఎస్ టి యు వజ్రోత్సవాల ముందుస్తు కార్యక్రమాలలో బాగంగా శనివారం  పత్తికొండ  ప్రభుత్వ  బాలుర పాఠశాలలో ఉపాధ్యాయులు మొక్కలు నాటారు. ఎస్ టి యు వజ్రోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని STUAP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్.తిమ్మన్న, పత్తికొండ మండల విద్యాధికారి శ్రీ మస్తాన్ వలి తో కలిసి, స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్ టి యు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు S. గోకారి, టి. కె.జనార్దన్ సైతం కార్యక్రమంలో పాల్గొని   మొక్కలు నాటారు. ఈ కార్యక్రమములో ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సి.నాగరాజు, సీనియర్ నాయకులు కె.సత్యనారాయణ,కుంపటి నారాయణ,వీర చంద్ర యాదవ్,సుంకన్న ,మండల నాయకులు బలరాం, మారుతి తదితరులు పాల్గొన్నారు.

About Author