PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వికలాంగులకు చేదోడుగా పోచిమి రెడ్డి             

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: వికలాంగులకు చేదోడు,వాదోడుగా అన్నివిధాలా పొచిమి రెడ్డి సేవాదళ్ ఆదుకుంటుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు మురళి ధర రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం  పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి, కృష్ణగిరి, మద్దికేర మండలాల వికలాంగులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. వికలాంగుల సమస్యల పట్ల స్పందించాలని నియోజకవర్గంలోని వికలాంగుల నాయకులు శ్రీ పోచిమి రెడ్డి మురళీధర్ రెడ్డిని ఈ సందర్భంగా కోరారు.ఈ మేరకు ఆయన స్పందించి, ఏ సమస్య వచ్చినా పోచిమి రెడ్డి సేవాదళ్ మీ వెన్నంటి ఉంటుందని తెలిపారు. పత్తికొండ నియోజకవర్గంలో ఇకపై జగనన్నకు తోడుగా వికలాంగులకు అండగా ఉంటుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో క్రిష్ణగిరి వెల్దుర్తి మద్దికేర మండలాల వికలాంగుల నాయకులు పాల్గొన్నారు.

About Author