PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మృతురాలి కుటుంబానికి పోచిమి రెడ్డి సేవాదళ్ సంస్థ ఆర్థిక సాయం

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రెడ్డి సేవాదళ్ సంస్థలో సభ్యురాలైన కళావతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోచిమి రెడ్డి సేవాదళ్ సంస్థ వ్యవస్థాపకులు మురళీధర్ రెడ్డి మృతురాలి కుటుంబానికి 5000 రు.లు ఆర్థిక సాయం అందించారు. జగనన్నకు తోడుగా పేద ప్రజలకు అండగా అని కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన పోచిమి రెడ్డి  సేవాదళ్ నందు పత్తికొండ నియోజకవర్గం లో అనేకమంది సభ్యులుగా ఉన్నారు. పోచం రెడ్డి సేవాదళ్ సంస్థలో సభ్యులుగా ఉన్న కుటుంబాలు ఆపదలో ఉన్న సమయంలో ఆర్థికంగా ఆదుకోవడం సేవాదళ్ సంస్థ ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా సంస్థలో సభ్యురాలైన  పత్తికొండ ఆంజనేయ నగర్ నందు నివాసం ఉంటున్న కళావతి అనారోగ్యంతో  మరణించిన విషయం తెలుసుకున్న శ్రీ పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి  అంత్యక్రియల నిమిత్తం రూ.5000/- ఆర్థిక సహాయం అందజేశారు.

About Author