PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్

1 min read


పల్లెవెలుగు వెబ్: పశ్చిమ గోదావరి జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠాగుట్టు రట్టు అయింది. నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఏలేటి చంద్ర శేఖర్, లాగు శ్రీను, పాపదాసు రమేష్ రెడ్డి, దోరేపల్లి మధు శేఖర్, శింగలూరు సురేష్, సిద్ధానిలను ఏలూరులో మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. నిందితుల నుంచి 1.50 లక్షల అసలు నోట్లు, 12 లక్షల విలువైన నకిలీ నోట్లు, 3 మోటార్ సైకిల్స్, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం, పోలవరం మండలాల్లో నకిలీ కరెన్సీని నిందితులు చెలామణి చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

About Author