PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

1 min read

 పల్లెవెలుగు వెబ్, మిడుతూరు: మండలపరిధిలోని తలముడిపి గ్రామంలో పేకాటరాయుళ్లపై  ఎస్ ఐ జి.మారుతిశంకర్  సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేశారు.ఎస్ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తలముడిపి గ్రామంలో మురళీ మోహన్ రెడ్డి కొట్టం పక్కన పేకాట ఆడుతున్న వారిపై దాడి చేసి 28600 నగదు మరియు 52 పేకాట ముక్కలు స్వాధీనం చేసుకున్నామని అదేవిధంగా గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి,శ్రీనివాసరెడ్డి,పాపారాయుడు,రాంభూపాల్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి ఈ ఐదు మంది పైన కేసు నమోదు చేశామని మాకు అందిన సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేశామని ఎస్ఐ తెలిపారు. మండలములో ఎక్కడైనా సరే ఇలాంటివి  జరిగితే సహించేది లేదని ఆయన అన్నారు.

About Author