PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధ్యాయులకు పోలీసు నోటీసులు !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ ఉద్యోగ సంఘాలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్యమానికి సిద్ధమవుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలకు పోలీసు నోటీసులు ఇచ్చారు. చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి ఉద్యోగ సంఘాల ఇంటి తలుపుతట్టారు. పీఆర్సీకి వ్యతిరేకంగా చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తు ఆంక్షలు విధించారు. ఇప్పటికే పలువురు ముఖ్యనేతలకు హౌస్ అరెస్ట్ నోటీసులు జారీ చేశారు. పోలీసులు తీరు పై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.

     

About Author