PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాపాదయాత్రకు అనుమతి… కండీషన్స్​ అప్లై

1 min read


పల్లెవెలుగు వెబ్: హైకోర్టు ఆదేశాలతో అమరావతి రైతులు చేపట్టనున్న మహా పాదయాత్రకు పోలీసులు అనుమతి మంజూరు చేశారు. పాదయాత్రను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే చేపట్టాలని నిబంధనలు పెట్టారు. అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు హైకోర్టుకు సమర్పించిన జాబితాలో ఉన్న 157 మంది మాత్రమే మహా పాదయాత్రలో పాల్గొనాలని పోలీసులు స్పష్టం చేశారు. పాదయాత్రలో పాల్గొనేవారు ఖచ్చితంగా ఐడీ కార్డులు ధరించాలని… పాదయాత్రలో డీజే సౌండ్ సిస్టమ్స్ వినియోగించకూడని స్పష్టం చేశారు. కాగా, నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు అమరావతి రైతులు హైకోర్టు నుంచి తిరుమలకు పాదయాత్ర చేయనున్నారు.

About Author