NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌బ్ పై పోలీసుల దాడి.. రాహుల్ సిప్లిగంజ్ అరెస్ట్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బంజారాహిల్స్‌లోని టాస్క్‌ఫోర్స్ అధికారులు రాడిసన్ బ్లూ హోటల్‌లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బిగ్‌బాస్ తెలుగు విజేత, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఇత‌ర ప్ర‌ముఖుల పిల్లలు అడ్డంగా బుక్కయ్యారు. సమయానికి మించి పుడింగ్ మింక్ పబ్‌ నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి పబ్ యజమానులతో సహా 150 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో రాహుల్ సిప్లిగంజ్, ప్ర‌ముఖుల పిల్లలు ఉన్నారు. పబ్‌లో భారీగా టాస్క్‌ఫోర్స్ అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు దాడులు నిర్వహించారు.

                                               

About Author