PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీస్ రిక్రూట్మెంట్ స్కామ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్ణాట‌క‌ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ స్కామ్ లో.. ఆ రాష్ట్ర CID దర్యాప్తు మరింత ముమ్మరమైంది. 125కి పైగా మార్కులు వచ్చిన అభ్యర్థులపై సీఐడీ దృష్టిసారించింది. ఆబ్జెక్టివ్ పరీక్షలో 150 మార్కులకిగానూ 125కిపైగా మార్కులు పొందిన 32 మంది అభ్యర్థులను గుర్తించినట్టు తెలిపింది. వీరి ఓఎంఆర్ షీట్లను ఫోరెన్సిక్ విశ్లేషణ చేయగా జవాబులు దిద్దిన విధానం ఒకేలా ఉందని అధికారులు వెల్లడించారు. మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడినవారు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని కర్ణాటక పోలీస్ వర్గాలు వెల్లడించాయి.

                                                  

About Author