PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీసులే కాల్చి చంపారు.. రాజు భార్య ఆరోప‌ణ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : సైదాబాద్ హ‌త్యాచార కేసులో నిందితుడు రాజును పోలీసులే కాల్చి చంపార‌ని అత‌ని త‌ల్లి, భార్య ఆరోపించారు. రాజు ఆత్మహ‌త్య ఘ‌ట‌న‌తో కుటుంబ స‌భ్యులు రోదిస్తున్నారు. రాజును చంపి క‌డుపుకోత మిగిల్చార‌ని రాజు త‌ల్లి ఆవేద‌న వ్యక్తం చేశారు. మృత‌దేహాన్ని అప్పగించాల‌ని భార్య, త‌ల్లి కోరుతున్నారు. రాజును ప‌ట్టుకోవ‌డానికి పోలీసులు రాష్ట్రం మొత్తం జ‌ల్లెడ‌ప‌డుతున్న నేప‌థ్యంలో వ‌రంగ‌ల్ జిల్లా స్టేష‌న్ ఘ‌న్ పూర్ వ‌ద్ద నాష్కాల రైల్వే ట్రాక్ పై విగ‌త‌జీవిగా ప‌డి ఉన్నాడు. అత‌ని శ‌రీరం పై ఉన్న గుర్తుల ఆధారంగా మృత‌దేహం రాజుదేన‌ని పోలీసులు గుర్తించారు.
మృత‌దేహంపై చెప్పులు విసిరిన స్థానికులు :
రాజు మృత‌దేహాన్ని పోలీసులు వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆస్పత్రికి త‌ర‌లించారు. కాజీపేట రైల్వే సీఐ రామ్మూర్తి ఆధ్వర్యంలో అంబులెన్స్ లో త‌ర‌లించారు. ఈ క్రమంలో కొంద‌రు గుర్తుతెలియ‌ని వ్యక్తులు రాజు మృత‌దేహం వెళ్తున్న అంబులెన్స్ పై చెప్పులు విసిరారు. దీంతో పోలీసులు వెంట‌నే అప్రమ‌త్తమ‌య్యారు. ఎంజీఎం ఆస్పత్రి వ‌ద్ద గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

About Author