PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సద్గురు మహాత్మ బడే సాహెబ్ దర్గాలో రాజకీయ ప్రముఖులు

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండల పరిధిలోని గంజిహళ్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ సద్గురు మహాత్మ గంజిహళ్లి బడే సాహెబ్ తాత 329వ ఉరుసు మహోత్సవాలలో నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, కూడా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి లు గంధం సందర్భంగా శ్రీశ్రీశ్రీ సద్గురు మహాత్మ గంజిహళ్లి బడేసా సాహెబ్ తాత దర్గా ను సందర్శించి దర్గా పిఠాధిపతులు ఆధ్వర్యంలో ప్రత్యేక ఫాతెహలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు రైతులు సుఖసంతోషాలతో వెలసిల్లాలని స్వామివారిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గంజిహళ్లి సర్పంచ్ చిలక రాముడు, మాజీ సర్పంచ్ తిరుమల రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్, పట్టణ అధ్యక్షుడు బుట్టా రంగయ్య,టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకె. రాజశేఖర్, గంజిహళ్లి మహేష్ రెడ్డి, మానిక్ రెడ్డి, టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు రజాక్, వడ్డె రంగన్న, మెకానిక్ బాషా, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.అలాగే శ్రీశ్రీశ్రీ సద్గురు మహాత్మ బడే సాహెబ్ స్వాముల వారి ఉరుసు మహోత్సవం సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం దర్గా వంశపారంపర్య పీఠాధిపతులు సయ్యద్ చిన్న ముద్దుగుల్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక ఫతేహాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కేంద్రమంత్రి కోట్ల జై సూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని కోరుకున్నారు. కార్యక్రమంలో పరమేష్ రెడ్డి, కృష్ణారెడ్డి, దర్గా ధర్మకర్త కుబేర్ రెడ్డి, తెదేపా నాయకులు సోగనూర్ లక్ష్మన్న, కృష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు.

About Author