PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజ‌కీయ సంచ‌ల‌నం జ‌ర‌గ‌బోతోంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశంలో రాజకీయంగా సంచలనం జరగబోతోందని సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు. దేశంలో కొత్త విద్యావ్యవస్థ తీరుపై కేసీఆర్‌ విమర్శలు సంధించారు. ఢిల్లీ లో సర్వోదయ స్కూల్‌ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తో కలిసి కేసీఆర్‌ సందర్శించారు. విద్యావిధానంలో ఢిల్లీ సర్కార్‌ తీసుకొచ్చిన మార్పులు, డిజిటల్ విధానం, నూతన సంస్కరణలను కేసీఆర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఏకపక్షంగా కేంద్రం కొత్త విద్యావిధానం తెచ్చిందని తప్పుబట్టారు. కొత్త విద్యావిధానంపై రాష్ట్రాలతో కేంద్రం సంప్రదించలేదని విమర్శించారు. ఢిల్లీ తరహాలో విద్యావిధానం ఉంటే తామూ ఆమోదిస్తామని, కానీ కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని కేసీఆర్ విమర్శించారు.

                                       

About Author