PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు:  ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కె సుధారాణి తెలిపారు. గురువారం వెలుగోడు మండలంలోని పోలింగ్‌ కేంద్రాలను వారు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలింగ్‌ కేంద్రాల్లో విధిగా పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. నిరంతరం విద్యుత్‌ సరఫరా ఉండేలా చూడాలని, మూత్రశాలలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.  ప్రతిపోలింగ్‌ కేంద్రం వద్ద దివ్యాంగుల నిమిత్తం ర్యాంపును ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అభ్యర్థులు సంపూర్ణంగా సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ వెంకటరమణ, వీఆర్వోలు అన్వర్, ఫర్జానా తదితరులు పాల్గొన్నారు.

About Author