PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాలిటెక్నిక్ పరీక్షలు రద్దు !

1 min read

పల్లెవెలుగువెబ్ : తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 8, 9వ తేదీల్లో జరిగిన పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ పరీక్షలను రద్దు చేశారు. ప్రశ్నపత్రాలు లీకైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆయా తేదీల్లో జరిగిన పరీక్షల పేపర్లు లీకైనట్టు సమాచారం అందడంతో రాష్ట్ర సాంకేతిక విద్యా బోర్డు (ఎస్‌బీటీఈటీ) అధికారులు విచారణ చేపట్టారు. పీపీకోడ్‌ 6336 (18ఈఈ – 302సీ ఎలక్ర్టికల్‌ సర్కూట్స్‌), పీసీకోడ్‌ 6301 (18సీ – 301ఎఫ్‌ అప్లయిడ్‌ ఇంజనీరింగ్‌ మ్యాథమెటిక్స్‌) ప్రశ్నపత్రాలు లీకైనట్టు గుర్తించారు. హైదరాబాద్‌ శివారులోని బాటసింగారంలో ఉన్న స్వాతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ కాలేజీలో పేపర్లు లీకైనట్టు అధికారులు నిర్థారించారు.

        

About Author