PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాలిటెక్నిక్ ప్రశ్నాపత్రాలు లీక్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ ప్రశ్నాపత్రాలు లీక్‌ అవడం కలకలం రేపుతోంది. ఈనెల 8 నుంచి పాలిటెక్నిక్‌ పరీక్షలు జరుగుతున్నాయి. కాగా ప్రశ్నాపత్రాలు లీకైనట్లు బోర్డు గుర్తించింది. ప్రశ్నాపత్రాల లీక్‌ను గుర్తించిన కాలేజీ ప్రిన్సిపల్స్‌ ఈ విషయంపై బోర్డుకు సమాచారమిచ్చారు. బాటసింగారం స్వాతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి పేపర్‌ లీక్‌ అయిందని, పేపర్‌ను వాట్సాప్‌ ద్వారా విద్యార్థులకు పంపించినట్లు గుర్తించారు. ప్రశ్నాపత్రాల లీక్‌ సంబంధించి కాలేజ్‌పై బోర్డు సెక్రటరీ ఫిర్యాదు చేశారు. దీంతో స్వాతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాలేజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

         

About Author