PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదల గుండె చప్పుడు.. వైఎస్సార్​…

1 min read

– ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, ఆదోని: ప్రజల సంక్షేమార్థం నిరంతరం శ్రమించి…దివికెగిసిన మహానేత డా. వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి జీవితం… ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి. గురువారం దివంగత నేత డా. వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని వైఎస్సార్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకు ముందు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు బైక్​ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రి, జీవన జ్యోతి అనాథ ఆశ్రమంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి మాట్లాడుతూ రైతులు, పేదల శ్రేయస్సు కోసం ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఇంటి స్థలాలు, డ్వాక్రా మహిళలకు రుణాలు, రెండు రూపాయిలకే కిలో బియ్యం అందించిన గొప్పనేత డా. వైఎస్సార్​ అని కొనియాడారు. తండ్రి బాటలో సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి నడుస్తున్నారని, పేదల సంక్షేమార్థం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. తండ్రికి మించిన తనయుడుగా నిరంతరం ప్రజాసేవకే జీవితం అంకితం చేస్తూ … అమ్మ ఒడి, మహిళా చేయూత, ఆటోమిత్ర, విద్యాకానుక తదితర కొత్త పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు దేవా, చంద్రకాంత్​ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ శాంతమ్మ , మధుసూదన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ భాష, మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింలు, ఎంఎంజి గౌస్ , కౌన్సిలర్ ఫయాజ్, చలపతి, శ్రీలక్ష్మి, రఘు రెడ్డి , రాజేశ్వర్ రెడ్డి , malakar గోవిందు, దుర్గప్ప నగర్ ఊరు చంద్ర రెడ్డి, కిట్టు , గోవింద , మస్తాన్ , మంజుల, క్రాంతి నగర్ నాయకులు పాల్గొన్నారు.

About Author