PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదోడి సొంతింటి కల నెరవేర్చిన సీఎం

1 min read

వైసీపీ నేత వై. ప్రదీప్​ రెడ్డి

మంత్రాలయం:పేదవాడి సోంతింటి కల నేరవేర్చిన ఘనత ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని వైఎస్సార్సీపీ నేత వై. ప్రదీప్ రెడ్డి  అన్నారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి  ఆదేశాల మేరకు చెట్నేహళ్లి గ్రామంలో శారదమ్మ, లక్ష్మన్న దంపతులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నూతనంగా నిర్మించిన ఇంటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వై. ప్రదీప్ రెడ్డి అన్న గారికి ముందుగా బీరప్ప గుడి వద్ద నుంచి ఉరేగింపు నిర్వహించి పూల వర్షం కురిపిస్తు, బాణ సంచా పేల్చి స్వాగతం పలికారు. రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశం చేశారు. అనంతరం వై. ప్రదీప్ రెడ్డి ని గజమాల తో సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజిని, ఉప సర్పంచ్ వీరనాగప్ప, ఎంపీటీసీ సభ్యుడు రామాంజనేయులు, నాయకులు అల్లింగప్ప, తిక్కస్వామి బంగారు బాబు, వెంకటేష్, నాగేంద్ర, గోవిందుతదితరులు ఉన్నారు

About Author