PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజల్లో..టీడీపీకి ఆదరణ పెరుగుతోంది : టి.జి భరత్

1 min read

వైసీపీ నుండి టిడిపిలోకి భారీగా చేరిన యువకులు

పల్లెవెలుగు:ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి భారీగా మద్దతు పెరుగుతోందని కర్నూలు నియోజకవర్గ తెలుగేదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. శనివారం రాత్రి 10 గంటల తర్వాత కర్నూలు నగరంలోని బండిమెట్ట, బుడా బుడ్డి మసీదు ప్రాంతానికి చెందిన యువకులు భారీగా తరలివచ్చి వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు నగర మైనారిటీ కమిటి టౌన్ ప్రెసిడెంట్ హమీద్ ఆద్వర్యంలో సలీం, మాబాషా, తైవాన్, అఫ్సర్, నయీం, జుబేయిర్, మున్నా, ఖైసర్, గౌస్, ఖాజా తో పాటు భారీగా యువత టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా ఆయా ప్రాంతాల్లో ప్రభావితం చేయగల వ్యక్తులని హమీద్ తెలిపారు. యువతకు టిజి భరత్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం టిజి భరత్ మాట్లాడుతూ రోజురోజుకీ ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పెరిగిపోతోందన్నారు. బండిమెట్ట, బుడాబుడ్డి ప్రాంతాల యువత టిడిపిలోకి తరలిరావడం సంతోషించే విషయమన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి  శక్తివంచన లేకుండా కష్టపడాలని సూచించారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని, కర్నూలును డెవలప్మెంట్ చేసేందుకు తాను ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ టి.జి భరత్ నాయకత్వంలో పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో టి.జి భరత్ ను ఎమ్మెల్యే చేస్తామన్నారు. కర్నూలు డెవలప్మెంట్ అవ్వడం తమకు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో యువత పాల్గొన్నారు.

About Author