NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎంని చంపుతానని సోషల్ మీడియలో పోస్ట్.. అరెస్ట్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : మానవబాంబుగా మారి సీఎంను చంపుతానని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యువకుడిని సీఐడీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. రాజమండ్రికి చెందిన రాజుపాలెం ఫణి హైదరాబాద్ లో ప్రైవేటు ఉద్యోగి. ఈనెల 16న ట్విట్టర్ లో పోస్టుపై తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారించినట్టు సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక తెలిపారు. వెంటనే పోస్టు డిలీట్ చేసి.. ఫణి తన ట్విటర్ అకౌంట్ క్లోజ్ చేశాడు. ఫోన్ కూడ స్విచ్చాఫ్ చేశాడు. అయినప్పటికీ ఫణి వివరాలు ట్రేస్ చేసి అరెస్టు చేశారు. రాజాపాలెం ఫణి తను జనసేన మద్దతుదారుడని చెప్పనట్టు పోలీసులు తెలిపారు. ఇలాంటి పోస్టులు పెట్టే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్పీ రాధిక తెలిపారు.

        

About Author