PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ప్ప‌ల‌తో ఆలుగ‌డ్డ కూర్మ‌.. ట్రిపుల్ ఐటీలో దారుణం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణ‌లోని బాసర ట్రిపుల్ ఐటీలో దారుణం వెలుగు చూసింది. కప్పలతో ఆలుగడ్డ కూర్మా చేసి విద్యార్థులకు వడ్డించారు. ఓ విద్యార్థి తన ప్లేట్‎లో కప్పను చూసి ఖంగు తిన్నాడు. మిగతా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అయితే అధికారులు-మెస్ కాంట్రాక్టర్ సంబంధీకులు కావడంతో విషయం బయటకు పొక్కకుండా వారిని కట్టడి చేశారు. బెదిరించారు. అయినా ఒక ఫోటో బయటకు వచ్చింది. బాసర ట్రిపుల్ ఐటీలో ఏడువేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి కోసం మూడు మెస్‎లున్నాయి. ఇవి ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించారు. మూడు మెస్‎ల నిర్వాహకులు -అధికారులు కలిసిపోయారు. కొన్నాళ్ళుగా విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారు. భోజనాల్లో పురుగులు నిత్యకృత్యం కాగా…తాజాగా కప్పను వడ్డించడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

                             

About Author