PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పొట్టిశ్రీరాములు త్యాగఫలితమే.. ఆంధ్ర రాష్ట్రం

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఇరిగేషన్​ డివిజన్​ కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలను ఏపీన్జీవోస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరితిని కొనియాడారు. అనంతరం ఏలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మంచెమ్ మైబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎందరో త్యాగధనుల ప్రాణ త్యాగాల వలన 1956 లో నవంబర్ 1న ఆంధ్రరాష్ట్రాన్ని ప్రకటించారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కి మనమంతా పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దేవప్రకాశ్ , డివిజన్ పర్యవేక్షకులు దిరిసాల రవి కుమార్, డివిజేన్ సిబ్బంది మధు, అద్భుతరావు, రామారావు, చక్రవర్తి, వలి,సత్య కృష్ణవేణి,సత్య భారతి తదితరులు పాల్గొన్నారు.

About Author