PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రానికి విద్యుత్​సంక్షోభం.. కరెంట్​ కోతలు తప్పవ్​! సజ్జల

1 min read

పల్లెవెలుగువెబ్​, అమరావతి: రాష్ట్రానికి విద్యుత్​ సంక్షోభం ముప్పు పొంచి ఉందని, మున్ముందు విద్యుత్​ కోతలు మరింత అనివార్యమయ్యే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. విద్యుత్​ సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ప్రజలు విద్యుత్​ వాడకం తగ్గించాలని కోరారు. విద్యుత్​ డిమాండ్​ అధికంగా ఉండే సమయాల్లో సాయంత్రం 6నుంచి రాత్రి 10గంటల దాకా ఏ/సీల వాడకాన్ని నియంత్రించాలని కోరారు. ప్రస్తుత కాలంలో విద్యుత్​ వాడకాన్ని గణనీయంగా తగ్గిస్తే వేసవిలో ఆదా విద్యుత్​ను వినియోగించుకునే సౌలభ్యం కలుగుతుందన్నారు. లేనిపక్షంలో పరిస్థితులు అదుతప్పే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. యూనిట్​ ధర రూ.20నుంచి రూ.25కు పెరిగే అవకాశం సైతం లేపపోలేదని, కోవిడ్​ సమయంలో ఆక్సీజన్​ కొరతను ఎలా ఎదుర్కొన్నామో… మున్ముందు విద్యుత్​ కొరత సైతం అదే తరహాలో ఉండొచ్చని హెచ్చరించారు. రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్​ 20శాతం పెరిగిందని, కోవిడ్​కు ముందు అక్టోబర్​లో రోజుకు 160ఎం.యూ మేర డిమాండ్​ ఉంటే… అది ప్రస్తుతం 190ఎం.యూ.కు పెరిగిందన్నారు. దేశంలో బొగ్గు కొరత కారణంగా థర్మల్​ విద్యుత్​ కేంద్రాల్లో ఉత్పాదకత శాతం తగ్గిందన్నారు. ఈ క్రమంలోనే సీఎం. జగన్ ఇటీవలే ప్రధాని మోడీకి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు.

About Author